VijayaKumar

Apr 15 2024, 17:31

వలిగొండ మండల కేంద్రంలో ఇంటింటికి బిజెపి ప్రచారం

*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, బూత్ అధ్యక్షుడు ఎల్లంకి మురళి ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ ప్రచారంలో భాగంగా మోడీ గారి నాయకత్వంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్, మాటురి పెద కిట్టు , BJYM జిల్లా కార్య వర్గ సభ్యులు దంతూరి అరుణ్ ,ఏళ్లంకి సతీష్ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 15 2024, 12:47

బీజేవైఎం భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా బుంగమట్ల మహేష్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన బుంగమట్ల మహేష్ కి భారతీయ జనతా యువమోర్చా భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా నియమిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుంగమట్ల మహేష్ మాట్లాడుతూ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియామకానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సీనియర్ నాయకుడు టెలికం అడ్వైజరీ బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య రాచకొండ కృష్ణ బచ్చు శ్రీనివాస్ ఇతర జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియమించినందుకు భారతీయ జనతా పార్టీని బీజేవైఎం బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అదేవిధంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గేలుపే లక్ష్యంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు.

VijayaKumar

Apr 15 2024, 11:03

ఇంద్రపాలనగరం లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాల నగరంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్నపేట ఎంపీపీ పూస బాలమణి - నరసింహ హాజరై అంబేద్కర్ నివాళులర్పించారు. మహనీయుని జయంతి ఉత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నూతనంగా రామన్నపేట ఎంపీపీగా ఎన్నికైన పూస బాల మణి - నరసింహ ని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గర్దాసు సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, మాజీ సర్పంచ్ పోతురాజు సుధాకర్, కొలుకులపల్లి చంద్రయ్య,మాజీ వార్డ్ మెంబర్ కొలుకులపల్లి యాదగిరి, కొలుకులపల్లి యాదయ్య, మహేష్ రవి, సంబోగు బాలస్వామి, కొలుకులపల్లి బాలరాజు, బొప్పని నగేష్, సంబొగు స్వామి, వంపు కృష్ణ, కొలుకులపల్లి నరేష్, కొలుకులపల్లి ప్రశాంత్, సంబొగు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 15 2024, 10:28

సుంకిశాల లో ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 14 2024, 23:36

భోగారంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామన్నపేట మండలం బోగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయి కుమార్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేడి కృష్ణ,అంబేద్కర్ యువజన సంఘం కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, విగ్రహం కమిటీ కోశాధికారి మేడి నరసింహ, కమిటీ గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, మాజీ ఎంపిటిసి మేడి రామలింగం,మాజీ వార్డ్ మెంబర్ మేడి యాదయ్య, మెట్టు అంజయ్య, బొడ్డుపల్లి లింగయ్య, గోగు శ్రీను,చింతల మల్లేష్,మేడి చిరంజీవి,మేడి శివ,మేడి ముఖేష్ ,గుంజా ఆంజనేయులు, గుంజ మహేష్, మేడి మల్లేష్,కునూరు రాజు గౌడ్ ,జల శ్రీనివాస్,బద్దుల మహేష్ ,బద్దుల రాజు ,చిరగోని నవీన్ గౌడ్, గుంజ గణేష్, గుంజ కనకయ్య,గుంజ సత్తయ్య,ఏర్పుల కిరణ్,మేడి స్వామి,మేడి లింగస్వామి, కునూరు వెంకన్న, మోహిన్, మెట్టు తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 14 2024, 14:45

వేములకొండ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని డా. బి. ఆర్. అంబేద్కర్ చౌక్ వేములకొండ గ్రామములో డా॥ బి. ఆర్.అంబెడ్కర్ గారి 133వ జన్మదిన వేడుకలు డా. బి. ఆర్. అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు బుంగ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

 ఈ కార్యక్రమానికి MPTC లా మండల ఫోరమ్ అధ్యక్షులు సామ రాంరెడ్డి గారు మండల పరిషత్ కోప్షన్ సభ్యులు SK రసూల్ , మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ న్యాయకులు పులిపల్పుల రాములు , గౌడ సంఘం అధ్యక్షులు పులిపాలుపుల మల్లేష్ గౌడ్ మాజీ వార్డ్ నెంబర్ మంటిపెల్లి రమేష్ గ్రామ న్యాయకులు,అంబట మోహన్ గాజుల యాదగిరి మరియు వివిధ పార్టీల న్యాయకులు పాల్గొన్నారు

ఇట్టి కార్యక్రమములో సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి లింగస్వామి గారు ,S మహేందర్ గారు , P. జగన్,V. లచ్చయ్య, R. గిరి, J గణేష్, M. ప్రభాకర్, J. మత్స్యగిరి, R. మత్స్యగిరి, S. నవీన్ , S. చింటూ, B. నవీన్, B. అనిల్, P.అఖిల్, R. ఉదయ్, D.మచ్చి, B. సత్తి, V. శివ, R. పవన్, V. నాని, D.మల్లేష్, బుంగ నంద కిషోర్, బుంగ రోషిని తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 18:42

ఈనెల 23న భువనగిరిలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ విజయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ


 ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 మంగళవారం తేదీన భువనగిరి పట్టణంలో జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయడం కోసం నల్గొండ రోడ్ లోని MNR గార్డెన్స్ లో సమావేశం నిర్వహించి వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు విశ్వహిందూ పరిషత్ యాదాద్రి ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పొత్నక్ రాఘవేందర్ మాట్లాడుతూ జరగబోయే ర్యాలీలో యువకులు హిందూ బంధువులు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని భవిష్యత్తులో హిందువులపై ఎవరైనా దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారరు జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన యువత తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేసి హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ వ్యవస్థా ప్రముఖక్ తాడం పాండు విశ్వహిందూ పరిషత్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవుల సాయి పట్టణ అధ్యక్షులు కేమోజు మల్లికార్జున్ కార్యదర్శి సాల్వేరు వేణు వల్లబోజు సతీష్ జిల్లా ధర్మ ప్రసార్ ప్రముఖక్ కోకల సందీప్ మందిర్ అర్చక పురోహిత్ ప్రముఖక్ ఆకుల అనిల్ జిల్లా సహ కార్యదర్శి పోచంగళ్ళ బాబు పాదరాజు మనోజ్ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను కో కన్వీనర్ మార్క శ్రావణ్ జిల్లా గోరక్ష ప్రముక్ పొన్నాల వినయ్ పట్టణ కన్వీనర్ నమిల నవీన్ భువనగిరి మండల కన్వీనర్ పిన్నపురాళ్ల రాజకుమార్ అవినాష్ రెడ్డబోయిన బాలరాజు బొక్క మాధవరెడ్డి ఎంకే శ్రీధర్ బిజెపి నాయకులు చందా మహేందర్ ఆకుతోట రామకృష్ణ గుప్తా కర్రే ప్రవీణ్ హిందు వాహిని కడారి శివ కందరి శ్రీధర్ ఊదరి రామరాజు పూస శ్రీనివాస్ సాయి విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

     

VijayaKumar

Apr 13 2024, 18:36

పోచంపల్లి పట్టణ కేంద్రంలో PDSU ఆధ్వర్యంలో జార్జిరెడ్డి 52వ వర్ధంతి


ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సాధారణ విద్యార్థిగా వచ్చి, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలకు ఎదురునిలిచి విద్యార్థులందరికీ అండగా నిలిచిన జార్జిరెడ్డి నేటి విద్యార్థిలోకానికి ఆదర్శం అని ప్రగతిశీల యువజన సంఘం పి.వై.ఎల్.పోచంపల్లి పట్టణ కార్యదర్శి పడాల శివ అన్నారు.

 జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో పి.డి.ఎస్.యూ.ఆధ్వర్యంలో జార్జిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో ప్రగతిశీల ఆలోచనలతో, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గళం ఎత్తి, వారితో మమేకమై ఉస్మానియా విశ్వవిద్యాలయ కేంద్రంగా విద్యా రంగ సమస్యలపై, విద్యార్థి హక్కులకై, విద్యార్థులపై చేస్తున్న మూకదాడులపై తిరుగుబాటు చేసిన విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి అని, జార్జిరెడ్డి ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాడో వారే నేడు పాలకులుగా మారి 10 ఏళ్లుగా దేశంలో అరాచక పాలన చేస్తూ, దేశాన్ని విధ్వంసం చేసే విధంగా సంస్కరణలు చేస్తున్నారని, మరో దఫా అధికారంలోకి రావడానికి కులాల పేరిట, మతాల పేరిట చిచ్చులు పెడుతూ, దేశభక్తి పేరుతో యువతను పెడదోవ పట్టించే విధంగా పాకిస్తాన్, చైనా బూచి చూపి ఉద్వేగాలు రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే కుయుక్తులు పన్నుతున్నారనీ,అసలు దేశ స్వతంత్రోద్యమంతో ఎలాంటి సంబంధం లేని ఆర్ఎస్సెస్,బీజేపీ నేడు సినిమా రంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అబద్ధపు కథలతో సినిమాలు తీసి, అదే నిజమైన చరిత్రగా, బ్రిటీష్ వారి బూట్లు తుడిచిన వారిని దేశభక్తులుగా చూపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని,

దేశంలోని విద్యారంగాన్ని విధ్వంసం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానం 2020 ని తీసుకొచ్చారనీ, దేశంలో మోడీ షా సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు. పోచంపల్లి పట్టణ నాయకులు మోజేశ్, కళ్యాణ్, చందు, రాము, సురేష్, జైపాల్, అరవింద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 18:30

భువనగిరిలో ఫుడ్ పాయిజన్ తో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో చికిత్స పొందుతున్న విద్యార్థులని శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న బాలుర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని హాస్టల్ సిబ్బంది, టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 13 2024, 17:35

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు కారణమైన ప్రిన్సిపాల్ , కేర్ టేకర్ లను సస్పెండ్ చేయాలి:AISF

యాదాద్రి భువనగిరి జిల్లా లో ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో గత రెండు రోజులుగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి విపరీతమైన వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు అని విద్యార్థుల కు ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని సంబంధిత ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు 

గత రెండు రోజులుగా భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో ఏడుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిసిందని ఒక విద్యార్థికి విషమంగా ఉండడంతో నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారని పరిస్థితి ఇంత విషమంగా ఉన్నప్పటికీ సంబంధిత ప్రిన్సిపాల్, రీజనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్ గారు ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగిందని, ఆర్ సి ఓ గారు తో మాట్లాడుతూ గత సంవత్సరం మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండల కేంద్రంలో కూడా 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేస్తూ ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మరియు ఫుడ్ పాయిజన్ కారణమైన కేర్ టేకర్ ని సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ )గా డిమాండ్ చేస్తు మాట్లాడడం జరిగింది

నిత్యం గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ గురై విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఇకనైనా జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాల లపైన సంబంధిత అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు రాష్ట్ర రకాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.